Telugu Gateway
Politics

వైసీపీ ఓటమే కెసీఆర్ కు నేనిచ్చే గిఫ్ట్

వైసీపీ ఓటమే కెసీఆర్ కు నేనిచ్చే గిఫ్ట్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు ఓ సారి అన్నా తెలంగాణ సీఎం ప్రస్తావించిన ‘రిటర్న్ గిఫ్ట్’ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించిన శనివారం నాడు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పెట్టుబడులు పెట్టడమే నాకిచ్చే రిటర్న్ గిఫ్టా..?. వైసిపి ఓటమిని తిరుగుటపాలో రిటర్న్ గిఫ్ట్ గా కెసిఆర్ కు పంపిస్తా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి రాజీనామా చేసిన గౌరు చరిత దంపతులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరారు. ఈ రోజు గౌరు చరితారెడ్డి,వెంకటరెడ్డి టిడిపిలో చేరారు. రాజకీయ కుటుంబాలన్నీటిడిపిలోనే. అభివృద్ధి కోసమే కోట్ల కుటుంబం,గౌరు కుటుంబం టిడిపిలో చేరాయి. కర్నూలులో తెలుగుదేశం ఘన విజయం తథ్యం. హైదరాబాద్ లో జగన్ కూర్చుని వైసిపి అభ్యర్ధుల ఎంపిక. రాజకీయం చేస్తే జగన్ ఇక్కడే చేయాలి.

హైదరాబాద్ లో కూర్చుని ఏపిలో రాజకీయం చేస్తారా..? కెసిఆర్ పంచన చేరి జగన్ మనపై కక్ష సాధిస్తున్నారు. వేరే రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో అభ్యర్ధుల ఎంపికా..? . ముగ్గురు మోదిలు కుమ్మక్కై ఏపిపై కుట్రలు. ఢిల్లీమోడీ, హైదరాబాద్ మోడీ, లోటస్ పాండ్ మోడీ’ అని ధ్వజమెత్తారు. టీడీపీలో చేరిక అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ ‘కొత్త వ్యక్తుల చేరికతో జగన్ మా సేవలు చాలన్నారు. మేము చేరినప్పుడు వైసిపిలో ఎవరూ లేరు. మా చేరిక తరువాతే కర్నూలులో వైసిపి బలపడింది. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ కృతజ్ఞత లేదు. ఆయన వ్యక్తిత్వం ఏమిటో అక్కడే తెలిసింది. వైసిపిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం మమ్మల్ని గౌరవించినందుకే టిడిపిలో చేరుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it