Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు షాకిచ్చిన చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్ కు షాకిచ్చిన చిరుమర్తి లింగయ్య
X

అవును. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నా. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ తరపున పోటీచేయాలనుకుంటున్నా. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నా అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం అని నిజమే అని తేలిపోయింది. అదీ కాంగ్రెస్ అధ్యక్షుడ రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రోజు ఈ ప్రకటన రావటం విశేషం. చిరుమర్తి లింగయ్య నల్లగొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైఖరిని తిరస్కరించి టీఆర్ఎస్ ను బలపర్చారని...అయినా పార్టీ నేతల వైఖరిలో మార్పు రావటం లేదని తన లేఖలో చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరించాల్సింది పోయి అడ్డుపుల్లలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లను ..ప్రాజెక్టులను అడ్డుకోవాలని కొంత మంది చూస్తున్నారని..ఇది తనకు నచ్చటం లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ జిల్లా..నకిరేకల్ ప్రగతి కోసం టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Next Story
Share it