Telugu Gateway
Politics

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్
X

కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా ఫిరాయిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్. ఇప్పటికే తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు డీ కె అరుణ గులాబీ గూటికి చేరారు. ఆమె మంగళవారం నాడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అయి బిజెపి కండువా కప్పుకున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు రాంమాధవ్‌ మంగళవారం అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఢిల్లీ వెళ్లి రాత్రి 1 వరకు చర్చలు జరిపారు. అనంతరం పా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు మహబూబ్‌నగర్‌ సీటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Next Story
Share it