Telugu Gateway
Cinema

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు బ్రేక్

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు బ్రేక్
X

రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఏపీలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణ హైకోర్టు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..ఏపీ హైకోర్టు మాత్రం తాము ఏప్రిల్ 3న స్వయంగా సినిమాను వీక్షించిన తర్వాతే అసలు విషయం తేల్చుతామని ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 29న విడుదల కావాల్సిన సినిమాకు బ్రేక్ పడినట్లు అయింది. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు కూడా పెద్ద సంచలనాలు సృష్టించాయి. ఏప్రిల్‌ మూడో తేదీ సాయంత్రం 4గంటలకు హైకోర్టు జడ్జి చాంబర్‌లోన్యాయవాదుల సమక్షంలో చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.. చిత్ర నిర్మాత ప్రివ్యూకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

సెన్సార్‌ బోర్డ్‌ ఒకసారి అనుమతించాక అడ్డు చెప్పడానికి వీలు ఉండదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు. పద్మావతి సినిమా రిలీజ్‌పై సుప్రీం కోర్ట్‌ ఆదేశాలను ప్రస్తావించి.. తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతించిన విషయాన్ని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో సినిమా విడుదల విషయంలో కూడా గురువారం రాత్రి వరకూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఓవర్సీస్ లో ప్రివ్యూలకు పర్మిషన్ ఇవ్వటంటతో సినిమా టాక్ బయటకు వస్తుందని..ఈ సమయంలో తెలంగాణలో అయినా విడుదల అవుతుంది లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.

Next Story
Share it