Telugu Gateway
Politics

పార్టీలో ఉండేందుకు అదాలకు బాబు 600 కోట్ల పనులిచ్చారా?

పార్టీలో ఉండేందుకు అదాలకు బాబు 600 కోట్ల పనులిచ్చారా?
X

తెలుగుదేశం ప్రభుత్వంలో ‘కాంట్రాక్టులు’ ఎలా కట్టబెట్టారో కళ్ళకు కట్టినట్లు నిరూపించే సంఘటన ఇది. ప్రభుత్వాన్ని తన రాజకీయ అవసరాల కోసం..నేతలను నిలబెట్టుకోవటం కోసం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగా దుర్వినియోగం చేశారో ఓ ప్రముఖ పత్రిక బహిర్గతం చేసింది. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వీడిన సమయంలో కలత చెందిన చంద్రబాబు ఆదాల కూడా పార్టీ మారతారని భయపడి ఆయన కోరినట్లు 600 కోట్ల రూపాయల విలువైన ‘సోమశిల హైలెవల్ కెనాల్’ పనులు కట్టబెట్టారని తేల్చేసింది. అంటే ఏపీలో కాంట్రాక్ట్ పనులు ఎలా ‘పంచారో’ ఈ సంఘటన నిరూపిస్తోంది. ఏపీలో అత్యంత కీలకమైన పనులు అన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెగా ఇంజనీరింగ్, నయువగా సంస్థలకే ‘పంచి’ పెట్టిన సంగతి తెలిసిందే. అదేదో మంత్రం వేసినట్లు అన్ని పనులు ఆ సంస్థలకే దక్కాయి. రాజధానికి సంబంధించి వేల కోట్ల రూపాయల పనుల్లోనూ ఇదే తంతు సాగింది. తాజాగా ఓ సర్వేల స్పెషలిస్ట్ కు అనంతపురం జిల్లాలో వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులను కేటాయించబోతున్నారని ‘తెలుగుగేట్ వే. కామ్’ కూడా ముందే తెలిపింది.

అన్నట్లుగానే ఈ కేటాయింపులు జరిగిపోయాయి. ఒక్క సాగునీటి శాఖే కాకుండా రాజధాని నిర్మాణ పనులు, మునిసిపల్, విద్యా శాఖ ఇలా ఎందులో అయినా సరే ‘టెండర్ల’కు ముందే పని ఎవరికి కేటాయించాలనేది ఖరారై అయేపోయేదని..తర్వాత మిగిలిన తంతు అంతా ఓ ‘నాటకమే’ అని సాక్ష్యాత్తూ అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారారనే కారణంతో ఆ పత్రిక ఆయనపై అక్కసు చూపించే క్రమంలో ‘చంద్రబాబునాయుడు’ పనులు ఎలా పంచిపెట్టారన్నది బయటపెట్టేసింది. అంటే కేవలం రాజకీయ నేతలను కాపాడుకోవటం, ముడుపుల కోసం, అస్మదీయులకే రాష్ట్రంలో ఈ ఐదేళ్ళ పాటు పనులు కేటాయించారనే విషయం మరోసారి స్పష్టంగా బహిర్గతం అయింది.

Next Story
Share it