Telugu Gateway
Politics

ఏపీపై మోడీ..జగన్..కెసీఆర్ వెయ్యి కోట్ల కుట్ర

ఏపీపై మోడీ..జగన్..కెసీఆర్ వెయ్యి కోట్ల కుట్ర
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై వెయ్యి కోట్ల రూపాయల కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల కోసం పొలిటికల్ మాఫియా విజృభిస్తోందని అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పార్టీ నేతలతో సోమవారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపిలో తన సామంతుడు ఉండాలనేది కెసిఆర్ కోర్కె అన్నారు. ‘ఏపిలో తమ పెత్తనం సాగాలన్నదే టిఆర్ ఎస్ లక్ష్యం. మన ఉలవచారు పశువులు తింటాయి అన్నారు. ఆంధ్రలో ఉండేవాళ్లంతా రాక్షసులే అన్నారు. లంకలో ఉండేవాళ్లే ఆంధ్రాలో పుట్టారన్నారు. 1956తరువాత వచ్చారని విద్యార్ధుల ఫీజులు ఇవ్వలేదు. 26కులాలను బిసి జాబితా నుంచి తొలగించారు. పోలవరంపై కెసిఆర్ కుమార్తె కేసులు వేస్తుంది. జగనే గెలుస్తాడని కెసిఆర్ కొడుకు అంటారు. వైసిపికి డబ్బుల మూటలు అందిస్తున్నారు. సిఆర్,జగన్,మోది రూ.1,000కోట్ల కుట్ర. కెసిఆర్, జగన్ లాలూచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టిఆర్ ఎస్ వంతపాడే వైసిపికి గుణపాఠం చెప్పాలి.

కెసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ పై ద్వేషం, జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ. టిఆర్ ఎస్, వైసిపి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పోలవరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారు. రాజధాని పనులపై విషప్రచారం చేశారు. చూసినవాళ్లంతా జరిగిన పనులపై ప్రశంసలు. గ్రాఫిక్స్ అనేవాళ్ల కళ్లు తెరిపించేలా పనులు. పశ్చిమగోదావరి జిల్లాలో వీడియో మార్ఫింగ్. కొండవీడు రైతుకు కులముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ ను బీహార్ రాష్ట్రం చేయాలనే కుట్ర. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలు ఏపిలో. బీహార్ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో కుల రాజకీయాలను చేసేది వైసిపి. దేశంలో మత రాజకీయాలను చేస్తోంది బిజెపి. రెండు పార్టీల నీచ రాజకీయాలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. 40ఏళ్ల నా రాజకీయంలో కులముద్ర లేదు. క్రిస్టియన్లపై దాడులు చేస్తే బిజెపిని విమర్శించరు. ముస్లింలపై దాడులు చేస్తే బిజెపిని ఒక్కమాట అనరు. నరేంద్రమోదిది అంతా ‘వన్ వే’ పోకడే. ‘టూ వే’ అనేది మోది డిక్షనరీలో లేదు. నరేంద్రమోదిని మించిన నటుడు లేడు. గొప్పగా నటిస్తారు, దాడులు చేయిస్తారు. దుర్మార్గ రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it