ఎన్టీఆర్ ఆశీస్సులు తనకే అంటున్న వర్మ
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వర్గం నుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయని ప్రకటించారు. కథానాయకుడు సినిమా ఫలితమే ఈ అంశాన్ని నిరూపిస్తోందని..ఎన్టీఆర్ ఆశీస్సులు లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అంశంపై ఆయన ట్విట్టర్ లో పలు అంశాలను ప్రస్తావించారు. తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ తనకు సూచించారని ట్వీట్ చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ థియట్రికల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోయేది ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ తేదీని ప్రకటించటంపై ఆధారపడి ఉంది.
మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్ నాకు సందేశం ఇచ్చారు. ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆయన సొంత కొడుకు కథానాయకుడును కాకుండా భార్య లక్ష్మీస్ ఎన్టీఆర్ను మాత్రమే ఆశీర్వదిస్తారు. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ల మధ్య పోటీని ఆయన స్వాగతిస్తారు’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.