నాగార్జునకు జోడీగా పాయల్ రాజ్ పుత్!
BY Telugu Gateway2 Feb 2019 4:42 AM GMT
X
Telugu Gateway2 Feb 2019 4:42 AM GMT
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ముఖ్యంగా యూత్ కు ఆమె అంటే అంత క్రేజ్. ఎందుకుంటే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ అలా ఆకట్టుకుంది యూత్ ను మరి. తాజాగా మాస్ మహారాజా రవితేజతో జోడీకట్టడానికి రెడీ అయిపోయిది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మన్మధుడు సినిమాకు సీక్వెల్ వస్తున్న చిత్రంలోనూ పాయల్ నటించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు సినిమా సీక్వల్ తెరకెక్కనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభ కానుంది. ఈ సినిమాలో పాయల్ ఎంపిక ఖరారు అయితే ఆమె తెలుగులో అంగీకరించిన మూడవ సినిమా అవుతుంది.
Next Story