Telugu Gateway
Cinema

కొత్త పాత్రలో ‘నిత్యామీనన్’

కొత్త పాత్రలో ‘నిత్యామీనన్’
X

నిత్యామీనన్. సంప్రదాయ పాత్రలు కాకుండా..వినూత్నమైన పాత్రల కోసం వెంపర్లాడే నటి. తన పాత్ర నిడివి కూడా ఆమెకు పెద్దగా పట్టింపు ఉండదు. పాత్ర నచ్చితే ఛాలు ఓకే చెప్పేస్తుంది. కమర్షియల్ సినిమాల్లోనూ డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ భామ. నిత్యామీనన్ ప్రస్తుతం అలాంటిదే మరో ప్రయోగం చేస్తోంది. అయితే అది బాలీవుడ్ లో. ఆమె ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘మిషన్ మంగళ్’ సినిమాలో శాస్త్రవేత్తగా కన్పించబోతుంది.

ఈ సినిమా షూటింగ్ ను కూడా నిత్య పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల సక్సెస్ స్టోరీ సినిమానే ఈ ‘మిషన్‌ మంగళ్‌’. అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షీ సిన్హా, కీర్తి కుల్హారీ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో సైంటిస్ట్‌ వర్షా పిళ్లై పాత్రలో నిత్యా మీనన్‌ కనిపిస్తారు.

Next Story
Share it