Telugu Gateway
Politics

చంద్రబాబును ‘ఫిక్స్’ చేస్తున్న ఎమ్మెల్యే

చంద్రబాబును  ‘ఫిక్స్’ చేస్తున్న ఎమ్మెల్యే
X

‘లోకేష్ అయితే ఓకే. లేదంటే నాకే. కొత్త వాళ్లకు ఇస్తే ఊరుకునేది లేదు’. ఇదీ కర్నూలు అసెంబ్లీ సీటుపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పెట్టిన కొత్త ఫిటింగ్. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఇప్పుడు సీటు టెన్షన్ స్పష్టంగా కన్పిస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఆయనకు అసెంబ్లీ సీటును టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రకటించేశారు కూడా. అయితే దీనిపై ఎంపీ టీ జీ వెంకటేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీలో సీట్లు కేటాయించటానికి ఓ పద్దతి ఉంటుంది అని..సీట్లు ప్రకటించటానికి లోకేష్ ఎవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ సీటుపై టీ జీ వెంకటేష్ తనయుడితోపాటు...పలు సమీకరణల్లో భాగంగా ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. అందుకే ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగడ వేశారు.

లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేస్తానని..వేరే ప్రత్యామ్నాయం కూడా కోరనని చెబుతున్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. పార్టీ కోసమే పనిచేస్తానని ప్రకటించారు. అయితే లోకేష్ కర్నూలు నుంచి పోటీచేసే సాహసం చేయరని ఎస్వీ మోహన్ రెడ్డికి తెలియదా?. కావాలనే ఇలా ఫిక్స్ చేశారని అంటున్నాయి పార్టీ వర్గాలు. మొత్తానికి కర్నూలు అసెంబ్లీ సీటు టీడీపీలో పెద్ద రచ్చ రేపటం ఖాయంగా కన్పిస్తోంది. మొత్తానికి కర్నూలు టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా మారటం ఖాయంగా కన్పిస్తోంది. తన కుమారుడు ఖచ్చితంగా కర్నూలు అసెంబ్లీ బరిలో ఉంటారని టీ జీ వెంకటేష్ చెబుతున్నారు.

Next Story
Share it