Telugu Gateway
Politics

లోకేష్ ఇజ్జత్ కా సవాల్!

లోకేష్ ఇజ్జత్ కా సవాల్!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఇఫ్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన ఇజ్జత్ కా సవాల్ గా మారింది ఈ సమస్య. మరి లోకేష్ మాట నెగ్గుతుందా?. లేక ఆయన మాటకు విలువ లేకుండా పోతుందా?. ఇదీ ఇఫ్పుడు తెలుగుదేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం కర్నూలు పర్యటన సందర్భంగా అధికారికంగా కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుకను ఎంపీగా వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ఘటనపై రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అసలు టిక్కెట్లు ప్రకటించటానికి లోకేష్ ఎవరు?. టీడీపీలో టిక్కెట్ల ప్రకటనకు ఓ పద్దతి ఉంటుంది అంటూ ఘూటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసలు సమయం ఆసన్నం కావటంతో లోకేష్ మాట నెగ్గుతుందా? లేదా ...పార్టీ అధినేత, చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తారు అన్న టెన్షన్ కర్నూలు టీడీపీ నేతల్లో ఉంది.

ఎంపీ బుట్టా రేణుకకు అయితే టిక్కెట్ ఇవ్వటం కష్టమే అని తేలిపోతోంది. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనుండటంతో ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి కర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వస్తుందా?. లేక టీ జీ భరత్ కు ఇస్తారా?. ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తే టీ జీ వెంకటేష్ నిర్ణయం ఎలా ఉంటుంది?. ఆయన పార్టీ మారటానికి రెడీ అయిపోతారా?. లేదంటే ఇండిపెండెంట్ గా అయినా సరే తన కుమారుడ భరత్ ను అసెంబ్లీ బరిలో నిలుపుతారా?. కర్నూలు అసెంబ్లీ సీటు మొత్తానికి హాట్ హాట్ చర్చకు తెరతీస్తోంది. చంద్రబాబునాయుడు కూడా కర్నూలు సీట్ల పంచాయతీపై ఫోకస్ పెట్టారు. మరి ఈ జిల్లా వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it