Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ పార్టీకి షాక్

కాంగ్రెస్ పార్టీకి షాక్
X

అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్. కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పార్టీని వీడుతున్నానని..ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితిని మదింపు చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే కాంగ్రెస్ పార్టీని వీడే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని..ఈ అంశంపై ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్లకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా ఆయన ఏపీలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుచెబుతూ వచ్చారు. ఈ విషయంలో ఆయన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో విభేదించారు.

Next Story
Share it