Telugu Gateway
Cinema

‘యాత్ర’ ట్రైలర్ వచ్చేసింది

‘యాత్ర’ ట్రైలర్ వచ్చేసింది
X

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో వైఎస్ పాత్రను ప్రముఖ మళయాళ హీరో మమ్ముటి పోషించిన సంగతి తెలిసిందే. వైఎస్ పాత్రకు మమ్ముటిని ఎంపిక చేసుకోవటంతోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

పాదయాత్రకు సంబంధించిన ఆయన నడక, హావభావాలు..డైలాగ్ లు వైఎస్ ను గుర్తు చేసేలానే ఉన్నాయి. , ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అనే డైలాగ్ లు ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.

https://www.youtube.com/watch?v=OuIJDxLeEBc

Next Story
Share it