‘యాత్ర’ ట్రైలర్ వచ్చేసింది
BY Telugu Gateway7 Jan 2019 2:56 PM GMT
X
Telugu Gateway7 Jan 2019 2:56 PM GMT
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో వైఎస్ పాత్రను ప్రముఖ మళయాళ హీరో మమ్ముటి పోషించిన సంగతి తెలిసిందే. వైఎస్ పాత్రకు మమ్ముటిని ఎంపిక చేసుకోవటంతోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
పాదయాత్రకు సంబంధించిన ఆయన నడక, హావభావాలు..డైలాగ్ లు వైఎస్ ను గుర్తు చేసేలానే ఉన్నాయి. , ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అనే డైలాగ్ లు ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.
https://www.youtube.com/watch?v=OuIJDxLeEBc
Next Story