Telugu Gateway
Cinema

రామ్ చరణ్, కైరా సందడి

రామ్ చరణ్, కైరా సందడి
X

సూపర్ హిట్ సినిమా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు వినయ విధేయ రామ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటించారు. వీళ్లిద్దరూ కలసి రానా షోలో సందడి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ అండ్ టీమ్ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. అందులో భాగంగానే రామ్ చరణ్, కైరా అద్వానీలు రానా షోలో పాల్గొన్నారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించగా..డీవీవీ దానయ్య సినిమా నిర్మాత. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా.. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్‌.

రానా నిర్వహిస్తున్న నెంబర్ వన్ యారీ మొదటి సీజన్‌ విజయవంతం కావడంతో.. రెండో సీజన్‌ను విజయ్‌ దేవరకొండతో ఫుల్‌ జోష్‌లో ప్రారంభించాడు రానా. ఈ మధ్యే బాలయ్య, క్రిష్‌లు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇప్పుడు చెర్రీ, కియారాల వంతు వచ్చింది. దీనిపై రానా ట్విటర్‌లో స్పందిస్తూ..‘ఈ ఏడాదిలో ఫస్ట్‌ టైమ్‌ చేసిన షూట్‌, ఈ సీజన్‌కు చేసిన లాస్ట్‌ షూట్‌ రెండూ నా నెం.1 యారీతోనే.. చూస్తూ ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు. వినయ విధేయ రామ జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it