Telugu Gateway
Cinema

అమ్మాయిలందరూ నా ఒక్కడికోసమే పుట్టలేదు!

అమ్మాయిలందరూ నా ఒక్కడికోసమే పుట్టలేదు!
X

‘ప్రపంచంలోని అమ్మాయిలందరూ నా ఒక్కడికోసమే పుట్టలేదు. వాళ్ళకూ ఓ జీవితం ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తా అంటూ ’ ఆకట్టుకుంటున్నాడు అక్కినేని అఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ సినిమాలోని డైలాగ్ ఇది. ‘ఒత్తిడి తగ్గించుకోవటానికి ఆ రోజుల్లో చాక్లెట్లతో పనైపోయేది.. కానీ టుడే స్ట్రెస్ లెవెల్స్‌ కి హ్యూమన్ టచ్ కావాలి’’ అని అఖిల్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. థమన్ బాణీలు కట్టారు.

‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూత్ ఆడియన్స్ మరోసారి టార్గెట్ చేస్తూ తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కేవలం 56 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లోని సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

https://www.youtube.com/watch?time_continue=23&v=9CY19BnsPoM

Next Story
Share it