Telugu Gateway
Politics

కర్నూలు టీడీపీలో కలకలం

కర్నూలు టీడీపీలో కలకలం
X

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కోట్ల..కెఈ గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత కె ఈ కృష్ణమూర్తికి మాట మాత్రంగా కూడా చెప్పకుండానే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చేర్చుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ పరిణామంపై కెఈ ఫ్యామిలీ గుర్రుగా ఉంది. అందుకే ఆయన స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. కోట్ల చేరికపై తనతో చర్చించారన్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని..తమకు ఈ విషయం ఏమీ తెలియదని అన్నారు.

పార్టీలో ఎంతో సీనియర్ అయిన తనకు ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని కెఈ ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కె ఈ కృష్ణమూర్తి అధికారాలకు కత్తెరపడింది. ఇఫ్పుడు ఏకంగా జిల్లాలో తనకు ప్రత్యర్ధులుగా ఉన్న కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించటం జిల్లా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.

Next Story
Share it