Telugu Gateway
Cinema

ఎఫ్2..రెండు మిలియన్లు దాటేసింది

ఎఫ్2..రెండు మిలియన్లు దాటేసింది
X

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..విదేశాల్లోనూ ‘బొమ్మ బ్లాక్ బస్టరే’. సంక్రాంతికి విడుదలైన సరదాల సినిమా ఎఫ్2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వంద కోట్ల రూపాయల గ్రాస్ ను దాటేసింది. ఇఫ్పుడు ఒవర్సీస్ లోనూ ఈ సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది. ఓ కామెడీ ఎంటర్ టైనర్ ఈ స్థాయి వసూళ్ళు సాధించటం అంటే విశేషమే. సినిమాకు వచ్చిన టాక్ కూడా అందుకు కారణంగా నిలిచింది.

ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతోపాటు తమన్నా, మెహరీన్ లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా మెహరీన్ చలాకీ అమ్మాయిగా దుమ్మురేపింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు విశేష ఆదరణ లభించటంతో తాజాగా చిత్ర యూనిట్ అదనంగా ఐదు సీన్లను యాడ్ చేశారు.

Next Story
Share it