Telugu Gateway
Politics

హోదా కోసం ఢిల్లీలో వైసీపీ దీక్ష

హోదా కోసం ఢిల్లీలో వైసీపీ దీక్ష
X

ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ ప్రత్యేక హోదా కోసం మళ్లీ పోరు ప్రారంభించింది. ఈ అంశంపై ఈనెల 27న ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబర్‌ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు హజరుకానున్నారు.

గతంలో ఏపీలో ప్రత్యేక హోదా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు వేదికను ఢిల్లీకి మార్చింది. మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండటంతో ప్రతి పార్టీ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తొలి నుంచి వైసీపీ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉండగా..అధికార టీడీపీ హోదా వేస్ట్ ప్యాకేజీ బెస్ట్ అంటూ వాదించి..చివరకు మళ్ళీ హోదానే కావాలంటే యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it