Telugu Gateway
Cinema

‘యాత్ర’ టీజర్ విడుదల

‘యాత్ర’ టీజర్ విడుదల
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు అయిన శుక్రవారం నాడు విడుదల చేసింది. టీజర్ లో రైతుల కష్టాలు..వైఎస్ పాదయాత్ర సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపారు. వైఎస్ గా నటించి మమ్ముట్టి ఓ రైతును పరామర్శిస్తూ ‘నేను విన్నాను..నేనున్నాను’ అని చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలుస్తుంది.

‘నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు.. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను మహానేతతో పంచుకుంటారు. ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=O_PthpuPypw

Next Story
Share it