తందానే...తందానే అంటున్న చరణ్
BY Telugu Gateway1 Dec 2018 11:43 AM GMT
X
Telugu Gateway1 Dec 2018 11:43 AM GMT
రామ్ చరణ్ సందడి ప్రారంభం అయింది. వినయ విధేయ రామ ప్రమోషన్ ఊపందుకుంది. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ సోమవారం నాడు సినిమా పాట తొలి సింగిల్ ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
దానయ్య నిర్మాత. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. రంగస్థలంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా ఇదే. దీంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. బోయపాటి శ్రీను సినిమా దర్శకుడు. తందానే తందానే చరణాలతో ఈ పాట ఉండనుంది.
Next Story