Telugu Gateway
Telangana

నాగంకు హైకోర్టులో షాక్

నాగంకు హైకోర్టులో షాక్
X

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశారు నాగం . ఈ కేసును విచారించిన హైకోర్టు బెంచ్ అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ పిటీషన్ ను కొట్టి వేసింది. దీంతో ఎన్నికల ముందు ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

కాంగ్రెస్ పార్టీపై అధికార టీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఈ విషయంలో విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళుతున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వెలువడిన తీర్పును నాగంను..కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది.

Next Story
Share it