Telugu Gateway
Politics

తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు ఫండ్ 1200 కోట్లు

తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు ఫండ్ 1200 కోట్లు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అవినీతి హిమాలయ పర్వతాల అంచుకు చేరిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల కోసం చంద్రబాబు ఏకంగా 1200 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రకటనల్లో చంద్రబాబు ఫోటో పెద్దదిగా వేస్తున్నారని దీన్ని చూస్తే అర్థం కావటంలేదా? అని ప్రశ్నించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు కూడా చంద్రబాబు రూ.500 కోట్లు పంపారని ధ్వజమెత్తారు. ఏపీలో దోచిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని తెలిపారు. నీతిమంతుడిని, సీనియర్‌ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాలుగేళ్లుగా విజయవాడలో ఒక బ్రిడ్జి కట్టలేని వ్యక్తి చంద్రబాబు. తెలంగాణలో తానే అభివృద్ధి చేశాడని బాబు గొప్పలు చెబుతున్నారు. 2013లో అవినీతి పరులు కాంగ్రెస్‌లో చేరుతారని చంద్రబాబు అన్నారు.

ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. చంద్రబాబువి నీచ రాజకీయాలు. జనసేన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి. 30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది. దళితులు, ఎస్సీలు, ఎస్టీలకు న్యాయం చేసేది వైఎస్సార్‌సీపీనే. దళితుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. తెలంగాణలో మీ మనస్సాక్షిగా ఓటు వేయండి. దేశంలో టీడీపీ ఎక్కడ పోటీ చేసినా బుద్ధి చెప్పండి. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు ఏపీకి ద్రోహం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీల హామీలను నమ్మడం లేదు. 25కు 25 ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీకి ఇవ్వండి. ఏపీకి హోదాపై సంతకం పెట్టిన పార్టీకి మద్దతిస్తాం అని తెలిపారు.

Next Story
Share it