Telugu Gateway
Politics

మాణిక్యాలరావుపై చంద్రబాబు ఫైర్

మాణిక్యాలరావుపై చంద్రబాబు ఫైర్
X

బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు లేఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఆయన కొత్త డ్రామాకు తెరతీసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ళు ప్రభుత్వంలో ఉండి..ఎప్పుడూ ఏమీ మాట్లాడని ఆయన ఇప్పుడు కొత్తగా విమర్శలు చేయటం ఏంటి? అని ప్రశ్నించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో కూడా ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపించారని చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీకి ఏం చేయని బీజేపీపై పోరాడకుండా కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

తాడేపల్లి గూడెం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడం తన బాధ్యత అని అన్నారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు. మాణిక్యాలరావు పోలవరంపై కేంద్రంతో పోరాడి... రాజీనామా చేస్తే బాగుండేదని చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు.

Next Story
Share it