Telugu Gateway
Politics

చంద్రబాబుపై హరీష్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై హరీష్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముసుగులో ఆయన తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముందు తన కోవర్టులను కాంగ్రెస్ లోకి పంపి తర్వాత చంద్రబాబే కాంగ్రెస్ కండవనే కప్పుకున్నారన్నారు. చంద్రబాబు తెలంగాణ అంతటా పోటీ చేస్తుంటే కేవలం కూకట్ పల్లి ,శేరిలింగపంపల్లి, ఖమ్మం లోనే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలింది సమైక్య వాదులే ...ఉత్తమ్ ,పొన్నాల ,జీవన్ రెడ్డి ,బలరాం నాయక్ ,జానారెడ్డి ,సుధీర్ రెడ్డి ,జగ్గారెడ్డి ,జైపాల్ రెడ్డి,చిన్నారెడ్డి అందరూ సమైక్య వాదం వినిపించిన వాళ్ళే అని ఆరోపించారు. తెలంగాణ ఉనికినే మహాకూటమి ప్రశ్నార్ధకం చేస్తోందని అన్నారు. హరీష్ సోమవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...‘నేను రాజకీయ నాయకుడిగా కాదు ,ఉద్యమ కార్యకర్తగా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ఇఫ్పుడు కొత్త కుట్రను కుట్రను కాంగ్రెస్ అమలు చేస్తోంది. తెలంగాణ 18 ఏళ్ళ కిందటే వచ్చేది ..చంద్రబాబు కుట్ర వల్లే ఆగిపాయింది ...అప్పటి బీజేపీ అగ్రనేతలు అద్వానీ ,యశ్వంత్ సిన్హా బాబు వల్లే తెలంగాణ ఇవ్వలేక పోయామని బహిరంగంగానే చెప్పారు.

తెలంగాణ అనే పదాన్ని చంద్రబాబు అసెంబ్లీ లో నిషేదించారు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జలదృశ్యం ను ఖాళీ చేయించింది చంద్రబాబే. ప్రణబ్ కమిటీ కి తెలంగాణ వద్దని టీడీపీ నేతలు రావుల ,ఎర్రన్నాయుడు లేఖ ఇచ్చారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రాన్ని రాసిస్తారా అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ కోసం నా జైత్ర యాత్రో శవ యాత్రో అని చెప్పి కెసిఆర్ దీక్ష కు బయలు దేరితే తెలంగాణ ప్రకటన వచ్చింది. వచ్చిన తెలంగాణ చంద్రబాబు అర్ధరాత్రి డ్రామా వల్ల ఆగిపోయింది ...2012 లో చంద్రబాబు మీ కోసం పేరిట నిర్వహించిన యాత్ర లో వరంగల్ లో జై తెలంగాణ బోనం ఇస్తే దాన్ని కాదనీ జై తెలుగు దేశం బోనం ఎత్తుకున్నారు ...అన్నిటికి అడ్డు పడ్డా తెలంగాణ అడ్డు పడ లేదని గొంతు పెంచుకుంటున్నారు ...గొంతు పెంచుకున్నంత మాత్రాన మీడియా మేనేజి మెంటు చేసినంత మాత్రాన చంద్రబాబు చెప్పే అబద్దాలు నిజం కావు. వారే ఇపుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.

అధికారంకోసం దేనికైనా దిగజారే చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదే ...చంద్రబాబు తెలంగాణ ను కబ్జా చేసేందుకు చంద్రబాబు గుంట కాడి నక్కలా ఎదురు చుస్తున్నారు. చంద్రబాబు కాళ్ళ దగ్గర కాంగ్రెస్ ను తాకట్టు పెట్టారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ ను ఏపీ లో కలిపిన కాంగ్రెస్ నాయకులు ఇపుడు చంద్రబాబు తో కలిసి అదే పని చేయబోతున్నారు. అపుడు తెలంగాణ ఏపీ లో కలవక పొతే ఇలాంటి పరిస్థితి ఉండేదా ?ఎపుడో బంగారు తెలంగాణ అయ్యేది ...జానా రెడ్డి తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని అసెంబ్లీ లో మాట్లాడారు ...తెలంగాణ లో ఎన్నికలు ముగియగానే చంద్రబాబు ఏపీ లో సమైక్యవాదం అందుకోవడం ఖాయం. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరు పాటు ప్రదర్శించినా సమైక్యవాదానికి దారులు పడుతాయి. హైదరాబాద్ లో టీడీపీ జెండాను ,చంద్రబాబు బొమ్మలను వాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో వాడుకోవడం లేదు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారు ...అన్నిటిని గుర్తు పెట్టుకుని ఓట్లేస్తారు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it