Telugu Gateway
Cinema

సెల్ ఫోన్ వాడే వారంతా హంతకులే... 2.0 ట్రైలర్ విడుదల

సెల్ ఫోన్ వాడే వారంతా హంతకులే... 2.0 ట్రైలర్ విడుదల
X

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ట్రైలర్ వచ్చేసింది. పలు వాయిదాల అనంతరం సినిమా విడుదలకు ముహుర్తం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ కు జోడీగా అమీజాక్సన్ నటించిన సంగతి తెలిసిందే. చెన్నయ్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్, సినిమా దర్శకుడు శంకర్ తోపాటు అక్షయ్ కుమార్, అమీజాక్సన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ 2.0 సినిమాతో తన కల నెరవేరిందని వ్యాఖ్యానించారు. 4 డీ సౌండ్స్ తో ఈ సినిమా తీశామని..ప్రేక్షకుడు తన సీటు కింద స్పీకర్ ఉందనే ఫీల్ కలుగుతుందని తెలిపారు. తన అభిమాన నటుడు రజనీకాంత్ అంటూ ఈ వయస్సులోనూ ఆయన సినిమా కోసం 18 కిలోల బరువు ఉన్న సూట్ ధరించారని చెప్పారు. మంచి కథ దొరికితే 3.0 కూడా తీస్తానని శంకర్ వ్యాఖ్యానించారు. భాషలకు చెందిన దర్శకులు, నటులు 2.0 సినిమా టీమ్ కు అభినందనలు తెలిపారు.

టీజర్ లో చూపించిన కొన్ని విజువల్స్ తో పాటు కొత్త అంశాలను ఈ ట్రైలర్ లో జోడించారు. సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే అంటూ అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సెల్ ఫోన్ చూడగానే మానవులు ప్రాణభయంతో చెల్లాచెదురు అవుతారు. అయాం చిట్టీ. రీ లోడెడ్. వెర్షన్ 2.0 అంటూ రజనీకాంత్ ఇందులో డైలాగులు చెబుతారు. అయస్కాంతం తరహాలో అమీజాక్సన్ వచ్చి రజనీకాంత్ కు అతుక్కుపోతుంది.ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఫోన్ల వాడకం వల్ల దుష్ప్రభావాలను ఈ సినిమాలో శంకర్ చెప్పే ప్రయత్నం చేసినట్లు కన్పిస్తోంది. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

https://www.youtube.com/watch?time_continue=121&v=QDKY8CRe1-0

Next Story
Share it