పొన్నాల హ్యాపీ..శశిధర్ రెడ్డికి షాక్
పొన్నాల లక్ష్మయ్య పోరాడి సాధించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ సీటును టీజెఎస్ అధినేత కోదండరాం ఆశించటంతో ఈ సీటుపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన పొన్నాలకే సీటు దక్కకపోవటంతో పార్టీలోకూడా ఒకింత కలకలం రేగింది. ఎట్టకేలకు మూడవ జాబితాలో పొన్నాల తన సీటు దక్కించుకున్నారు. మరో సీనియర్ నేత శశిధర్ రెడ్డికి మాత్రం షాక్ తగిలినట్లు అయింది. సనత్ నగర్ సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించటంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శనివారం నాడు 13 మంది పేర్లతో మూడవ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ 88 సీట్లు ప్రకటించినట్లు అయింది.
సనత్ నగర్ నుంచి టీడీపీ తరపున కూన వెంకటేష్ గౌడ్ పోటీచేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ రేకుల భూపతిరెడ్డికి ఆ సీటును కేటాయించారు. ఇంకా ఆరు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మూడో జాబితాలో ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ముగ్గురు ఎలక్ష్మయ్యస్టీలు, ఒక ఎస్సీకి సీట్లు దక్కాయి. ఎల్బీ నగర్ సీటును సుదీర్ రెడ్డికి కేటాయించారు.తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్ కు దక్కగా..దేవరకొండ బాలూ నాయక్ కు, ఇల్లెందు బానోతు హరిప్రియా నాయక్ కు, కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డికి, బోధ్ సోయం బాబూరావుకు, బాల్కోండ సీటును అనిల్ కుమార్ కు కేటాయించారు.