Telugu Gateway
Telangana

యుద్ధానికి వెళుతున్నా..ఆశీర్వదించండి

యుద్ధానికి వెళుతున్నా..ఆశీర్వదించండి
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికలను యుద్దంతో పోల్చారు. యుద్ధానికి బయలుదేరానని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. తన నామినేషన్ కు ముందు సంప్రదాయం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు పెట్టి ప్రార్థించారు. మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కి వంద సీట్లు దక్కేలా ఓటు వేయాలని ప్రజలను కోరారు. సిద్దిపేట నుండి హరీష్ రావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్న దేశంలోనే సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో అనే విధంగా రైతాంగాన్ని అభివృద్ధి చేసి తీరుతా. ప్రతి రాజకీయ అడుగులో ఈ ప్రాంతం నాకు అండగా నిలిచింది... ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం లేనిది ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సిద్ధిపేట ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. చిరంజీవి హరీష్ రావు కు ఈ ప్రాంత అభివృద్ధిని అప్పగించి వెళ్ళాను. చిరంజీవి హరీష్ రావు గొప్పగా పనిచేస్తున్నారు లక్షఓట్ల మెజార్టీతో హరీష్ రావు ను గెలిపించాలి. రాజకీయ యుద్ధంలోకి దిగబోతున్న 100 నియోజకవర్గాల్లో విజయం సాధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను అని పేర్కొన్నారు కెసీఆర్.

Next Story
Share it