Telugu Gateway
Telangana

కెసీఆర్ కుటుంబమే బాగుపడింది

కెసీఆర్ కుటుంబమే బాగుపడింది
X

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బాగుపడింది ఎవరైనా ఉన్నారా? అంటే అది కెసీఆర్ కుటుంబమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాకూటమి ప్రభుత్వం అదికారంలోకి వస్తే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఒక్క వ్యక్తి ఆలోచనలతోనే..ఇష్టాలతోనే సాగిందని తెలిపారు. నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, సోనియా గాంధీ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు.

అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తి తన ఇష్టానుసారం పాలన చేసి ప్రజల కలల్ని కాలరాశారని ఆరోపించారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ టీజేఎస్‌, సీపీఎం, టీడీపీలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు..మీ స్వప్నాలను నెరవెర్చేందుకు సోనియా ప్రయత్నించారన్నారు. తెలంగాణ ప్రజల శ్వేదం..ఉద్యమంతోనే రాష్ట్రం వచ్చింది. మీ పోరాటాలతో పాటు సోనియా కృషి వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు.

Next Story
Share it