‘కవచం’తో వస్తున్న బెల్లంకొండ
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’తో డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సినిమా హిట్టా..పట్టా సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఈ హీరో నటించిన తాజా సినిమా ‘సాక్ష్యం’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఇద్దరు హీరోయిన్లతో జోడీ కట్టి ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నారు. కవచం సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది.
‘అనగనగనగా ఓ రాజ్యం ... ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’... అని విలన్ వాయిస్లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే డైలాగ్తో రిలీజైంది ‘కవచం’ టీజర్. శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నవీన్ శొంఠినేని (నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కవచం’.
https://www.youtube.com/watch?v=UeUC4c_oBbY