సవ్యసాచి టీజర్ విడుదల
శైలజారెడ్డి అల్లుడు సినిమాతో సందడి చేసిన అక్కినేని నాగచైతన్య మరో కొత్త సినిమా శరవేగంగా రెడీ అవుతోంది. అదే సవ్యసాచి. ఈ సినిమాకు సంబంధించి టీజర్ సోమవారం నాడు విడుదలైంది. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య డైలాగ్ లతో ఇవి విడుదలైంది.
‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
https://www.youtube.com/watch?v=DmBi-RgGesk