Telugu Gateway
Telangana

ఉత్తమ్ వర్సెస్ కెటీఆర్

ఉత్తమ్ వర్సెస్ కెటీఆర్
X

తెలంగాణ పోలీసుల వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికల తరుణంలో మంత్రి కెటీఆర్ బంధువు అయిన ప్రభాకర్, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కెటీఆర్ కు చెందిన మరో బంధువు రాధాకృష్ణరావు ప్రతిపక్ష నేతలకు చెందిన వాహనాలు సోదా చేస్తూ..వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వీళ్ళిద్దరూ ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని ట్వీట్ చేశారు.

గతంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉత్తమ్ ట్వీట్లపై మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలతో కారులో పట్టుపడ్డారని..అందుకే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ఎంతో మంచి పేరుందని..దిగజారరుడు వ్యాఖ్యలతో అది దెబ్బతీయవద్దని వ్యాఖ్యానించారు.

Next Story
Share it