గీతామాధురి గుస్సా
పాటలు పాడే ఆ గొంతు..ఇప్పుడు గరం గరంగా మారింది. అడ్డగోలు వార్తలు రాస్తూ....వీడియో లు పెడుతున్న కొన్ని ఛానళ్ళకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మహా అయితే ఓ రోజు బాధపడతా..తర్వాత శాంతి నాదే కంటూ అంటూ వరస పోస్టింగ్ లు పెట్టారు గీతా మాధురి. గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్గా నలిచిన సంగతి తెలిసిందే. ఆమె తాజాగా కొన్ని యూట్యూబ్ చానెళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రెజెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు పెట్టినందుకు కొన్ని యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి ముందు ఆ వీడియోలను తీసివేయడానికి, సదరు యూట్యూబ్ ఛానెళ్లకి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు. మరి గీతామాధురి వార్నింగ్ ను ఆ ఛానళ్ళు పట్టించుకుంటాయా? లేదా వేచిచూడాల్సిందే.