Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి రమేష్ రాథోడ్

కాంగ్రెస్ లోకి రమేష్ రాథోడ్
X

టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మళ్లీ పార్టీ మారారు. ఆయన ఈ సారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తన సతీమణి సుమన్ రాథోడ్ తో కలసి ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో టిక్కెట్ రాకపోవటంతో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసి..పార్టీ ఫిరాయించేశారు. అంతే కాదు..తెలంగాణ అంతటా పర్యటించి టీఆర్ఎస్ ఓటమికి కృషి చేస్తానని తెలిపారు. తమ జాతికి ఏమైనా న్యాయం జరిగింది అంటే అది కాంగ్రెస్ హయాంలోనే అని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆయన ఖానాపూర్ సీటు ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం రమేష్ రాథోడ్ కు కాకుండా, తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కే కేటాయించారు. దీంతో రమేష్ రాథోడ్ భారీ ర్యాలీ నిర్వహించి సీఎం కెసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కు కాదని..టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల మధ్యే అన్నారు. అదే సమయంలో ఆయన పార్టీపై విమర్శలు చేసే నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

Next Story
Share it