Telugu Gateway
Politics

కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు

కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు
X

ఊహించిందే జరిగింది. కొండా దంపతులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాత గూటికే చేరుకున్నట్లు. బుధవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో వీరు తిరిగి కాంగ్రెస్ లోకి ప్రవేశించారు. కొండా సురేఖ, కొండా మురళీలకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ జిల్లా నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యే ఉత్తమ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకుడు రమేష్ రాథోడ్ కూడా రాహుల్ గాంధీని కలిశారు.

మంగళవారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ లపై కొండా దంపతులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సీట్లను గెలిపించుకుని వచ్చి మళ్లీ రాహుల్ గాంధీని కలుస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ దగ్గర టిక్కెట్ల అంశం ఏమీ ప్రస్తావనకు రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Next Story
Share it