Telugu Gateway
Telangana

కాంగ్రెస్ లో కమిటీల రచ్చ..కోమటి రెడ్డి ఫైర్

కాంగ్రెస్ లో కమిటీల రచ్చ..కోమటి రెడ్డి ఫైర్
X

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీ రచ్చ మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన కమిటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కుంతియా తెలంగాణ కాంగ్రెస్ కు శనిలా దాపురించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..కుంతియాతోపాటు ఎవరూ తనకు బీ ఫాం రాకుండా ఆపలేరని అన్నారు. గాంధీ భవన్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు. పైరవీ కార్లకు..బ్రోకర్లకు పదవులు ఇస్తారా? అంటూ నిలదీశారు.

ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యముందో తెలుసుకోవాలని పార్టీ అధినాయకత్వానికి హితవు పలికారు. వార్డు మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీలలో ప్రాధాన్యమిచ్చారని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. నిన్న, మొన్న పార్టీలో చేరిన వారికి... జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Next Story
Share it