Telugu Gateway
Telangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు
X

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ఎన్నికల వేళ ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే సహించరాదని పార్టీ నిర్ణయించింది. తాజా కమిటీలపై తీవ్ర విమర్శలు చేసిన అంశాన్ని క్రమశిక్షణా సంఘం సమీక్షించింది. అందులో భాగంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో ఈ నోటీసుకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. అయితే మరో సీనియర్ నాయకుడు విహెచ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.

అయితే ఆయన వ్యాఖ్యలపై కూడా క్రమశిక్షణా కమిటీ చర్చించింది. వీరిద్దరి తీరుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంతియా తెలిపారు. వీరిద్దరి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.

Next Story
Share it