బాలాపూర్ లడ్డుకు భారీ ధర
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అంటే రెండే కీలక సంఘటనలు. అందులో ఒకటి ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం. రెండవది బాలపూర్ లడ్డూ వేలం. అంత మాత్రాన మిగతా వినాయకులకు ప్రాధాన్యత ఉండదని కాదు. అందరి చూపు ఎక్కువగా వీటిపైనే ఉంటుంది. ఎందుకంటే వీటికి అంత చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా బాలాపూర్ లడ్డు వేలం హంగామాగా సాగింది. బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ. 16లక్షల 60వేలకు శ్రీనివాస్ గుప్తా లడ్డూను సొంతం చేసుకున్నారు.
గతేడాదితో పొలిస్తే బాలాపూర్ లడ్డూ లక్ష రూపాయలు అధికంగా పలికింది. భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం అత్యంత వేడుకగా సాగింది. బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైనప్పటికీ అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు అది 16.60 లక్షలకు చేరింది.