Telugu Gateway
Telangana

మియాపూర్-ఎల్ బీ నగర్ మార్గంలో మెట్రో పరుగులు

మియాపూర్-ఎల్ బీ నగర్  మార్గంలో మెట్రో పరుగులు
X

హైదరాబాద్ లో అత్యంత రద్దీ ఉండే మార్గంలో ట్రాఫిక్ కష్టాలు కొంత మేర అయినా తగ్గబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మియాపూర్-ఎల్ బీ నగర్ మార్గంలో మెట్రో రైలు పరుగులు ప్రారంభించింది. ఇప్పటికే మియాపూర్-నాగోల్ కారిడార్ లో మైట్రో సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అమీర్ పేట నుంచి ఎల్ బీ నగర్ వరకూ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ సర్వీసులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నుంచే ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ లో మొదట మెట్రో సర్వీసులు గత ఏడాది నవంబర్ లో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. తాజా మార్గంతో హైదరాబాద్ లో మెట్రో సేవలు 46 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చినట్లు అయింది. ఈ మైలురాయితో హైదరాబాద్ ఓ కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం ఢిల్లీ తర్వాత ఎక్కువ మొత్తంలో మెట్రో సర్వీసులు ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. బెంగుళూరులో ప్రస్తుతం 42.3 కిలోమీటర్లు, చెన్నయ్ 35.3 కిలోమీటర్ల మార్గంలోనే మైట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.

Next Story
Share it