Telugu Gateway
Cinema

రష్మీ కొత్త సినిమా వస్తోంది

రష్మీ కొత్త సినిమా వస్తోంది
X

రష్మీ బుల్లి తెరమీదే కాదు..వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. గుంటూరు టాకీస్ సినిమాలో తన అందచందాలతో కుర్రకారు మనసు దోచేసిన ఈ భామ..ఇప్పుడు మళ్ళీ ‘అంతకుమించి’ అంటూ ముందుకొస్తోంది. ఆమె నటించిన సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోగా జై నటించారు. హారర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన ఆర్‌ ఎక్స్‌100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి.

ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా’. అని వ్యాఖ్యానించారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

Next Story
Share it