Telugu Gateway
Cinema

‘నీవెవరో’ ట్రైలర్ విడుదల

‘నీవెవరో’ ట్రైలర్ విడుదల
X

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ లు జంటగా నటించిన సినిమానే ‘నీవెవరో’. ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ఆదివారం నాడు సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా సస్పెన్స్..థ్రిల్లర్ ను తలపించేలా సాగింది. ఈ సినిమాకు హరినాథ్ దర్శకత్వం వహించారు. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను రూపొందించారు.

ఆది ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. చివరకు ఎవరి చెంతకు చేరతారో సినిమా చూస్తే తప్ప తెలియదు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘వాళ్ళ నాటకాలకు నేను చెక్ పెడతాను’ అంటూ ఆది చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది ఈ సినిమాలో ఆది చెఫ్ గా కన్పించబోతున్నారు.

https://www.youtube.com/watch?v=TfjQThw-RAk

Next Story
Share it