నవాబ్ ట్రైలర్...క్రిమినల్స్ కొత్త పేర్లు ఇవే!
‘ఈ రోజు క్రిమినల్స్ కు చాలా పేర్లు ఉన్నాయి. పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రియల్ ఎస్టేట్ కింగ్, ఇసుక మాఫియా’ అంటూ డైలాగ్ తో ‘నవాబ్’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇస్తారు. సంచలన చిత్రాల దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు..ఈ సినిమాలో ఎంతో మంది లెజెండరీ నటులు ఉన్నారు. ట్రైలర్ ను చూస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదనే విధంగా ఉంది. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. మణిరత్నం మార్క్ టేకింగ్ టాప్ స్టార్స్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ట్రైలర్ లో అరవింద స్వామి నీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? నమ్మోద్దు అంటూ ఓ డైలాగ్ చెబుతారు. ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.
https://www.youtube.com/watch?v=1KLEuNOZZco