మెగా చేతికి తెలంగాణలో గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు
మౌలికసదుపాయాల కల్పనా రంగంలో అగ్రగామిగా ఉన్న మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు గ్యాస్ పంపిణీ రంగంలోనూ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మెగా ఇంజనీరింగ్ కు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో ఈప్రాజెక్టు దక్కింది. ఇంటింటికీ వంటగ్యాస్ను అందించే ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను ఎంఈఐఎల్ దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) పి. రాజేష్ రెడ్డి తెలిపారు.. పీఎన్జీఆర్బీ ఇప్పటికి తెరచిన బిడ్లలో వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలను దక్కించుకుంది.
మరికొన్ని బిడ్లు తెరవాల్సి ఉంది. 2020 నాటికి కోటి గృహాలకు ఇంటింటా వంట గ్యాస్ చేరాలనేది కేంద్రం లక్ష్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ స్మార్ట్-ఇట్స్ గుడ్’ పేరుతో గ్యాస్ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటా గ్యాస్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిడ్డింగ్లో పాల్గొని, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లాలు ఒక యూనిట్గానూ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు మరో యూనిట్గానూ, మూడో యూనిట్ కింద నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద కంపెనీ పది జిల్లాల్లో 3100 కిలోమీటర్ల పైప్లైన్ను వేయనుంది.