Telugu Gateway
Andhra Pradesh

పదహారేళ్ల అబ్బాయితో 30 సంవత్సరాల మహిళ పరారీ

పదహారేళ్ల అబ్బాయితో 30 సంవత్సరాల మహిళ పరారీ
X

ఆమె వయస్సు ముప్పయి సంవత్సరాలు. పెళ్ళి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె ఓ పదహారు సంవత్సరాల కుర్రాడితో కలసి వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో ఆమె భర్తలు..పిల్లలు షాక్ కు గురయ్యారు. ఈ విస్మయకర ఘటన ఒంగోలులో జరిగింది. ఈ విషయం ఆ ప్రాంతంలో పెద్ద సంచలనంగా మారింది. బాలుడి తల్లి,దండ్రులు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కుర్రాడు..ఆ మహిళ పక్కపక్కనే ఇళ్ళలోనే ఉంటారు. ఈ కుర్రాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆకర్షణలకు లోనయ్యే వయస్సు కావటంతో ఆ కుర్రాడు కూడా పక్కన ఉండే మహిళతో సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం.

ఈ తరుణంలో భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తటంతో ఆ మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెతోపాటు కుర్రాడు కూడా కన్పించకపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్ చదివే ఈ కుర్రాడు కూడా తర్వాత సెల్ ఫోన్ స్విచ్చాప్ చేసుకున్నాడు. దీంతో పోలీసులు వీరిద్దరి కోసం వేట సాగిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు పక్కనే ఉన్న తమిళనాడుతోపాటు కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా జరిగాయి.

Next Story
Share it