Telugu Gateway
Cinema

కీర్తి సురేష్ విరాళం 15 లక్షలు

కీర్తి సురేష్ విరాళం 15 లక్షలు
X

హీరోయిన్ కీర్తి సురేష్ కేరళ వరద బాధితులకు 15 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆమె చెక్కును ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు అందజేశారు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ‘సావిత్రి’ బయోపిక్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సావిత్రి కూడా నిజజీవితంలో తాను సంపాదించిన డబ్బు అంతా కష్టాల్లో ఉన్న వారు ఎవరైనా అడిగితే చాలు అలా ఇచ్చేవారు. కీర్తి సురేష్ కూడా ఇఫ్పుడు వరద బాధితులను ఆదుకోవటానికి తన వంతు సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు. కీర్తి సురేష్ తోపాటు నటి పూనమ్ పాండే కూడా తన సినిమా పారితోషికం మొత్తం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

Next Story
Share it