Telugu Gateway
Politics

టీడీపీలోఆగని ‘కాంగ్రెస్ చిచ్చు’

టీడీపీలోఆగని ‘కాంగ్రెస్ చిచ్చు’
X

తెలుగుదేశం పార్టీలో ‘కాంగ్రెస్ కలకలం’ ఆగటం లేదు. కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించే వారిని ఏమీ అనని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొత్తును వ్యతిరేకించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టే చంద్రబాబు వైఖరి ఎలా ఉందో అర్థం అవుతూనే ఉంది. మంత్రులు కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అసలు పొత్తు ప్రతిపాదనే లేనప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చెప్పటంలో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకించే వారిపైనే ఆంక్షలు విధించాలని చూడటంతో చంద్రబాబు చెప్పకనే విషయాన్ని చెప్పేస్తున్నారు. కె ఈ కృష్ణమూర్తి వంటి సీనియర్ నేతలకు వర్ల రామయ్య పద్దతులు చెప్పటంతో ఆయన కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

తనకు చెప్పటానికి అసలు వర్ల రామయ్య ఎవరు? అని ప్రశ్నించారు. కె ఈ తాజా మరోసారి పొత్తు అంశంపై మాట్లాడారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీలతో టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండబోదని ఆయన తెగేసి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్‌ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్‌టీఆర్‌ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు.

Next Story
Share it