ట్రంప్..కిమ్ ను లోపలేసి కుమ్మితే..!
ఆది పినిశెట్టి. కేవలం హీరో పాత్రలే కాకుండా...విభిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆది, తాప్సీ, రితికా సింగ్ లు జంటగా నటించిన ‘నీవెవరో’ సినిమా టీజర్ ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఇందులో ఆది పినిశెట్టి కంటే వెన్నెల కిషోర్ చెప్పే...ట్రంప్..కిమ్ లను అయినా లోపలేసి కుమ్మితే అంటూ చెప్పే డైలాగ్ లే హైలెట్ గా నిలుస్తాయి. కోన వెంకట్, ఎం వి వి సత్యనారాయణలు సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో రూపంలో వస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి అని ఆది చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఇందులో ఉంది. క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ‘నీవెవరో’ తెరకెక్కుతోంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=QF9b4ezWUDA