Telugu Gateway
Cinema

‘సాక్ష్యం’ సినిమాకు షాక్

‘సాక్ష్యం’ సినిమాకు షాక్
X

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏకంగా ఈ సినిమాను మినీ బాహుబలిగా అభివర్ణించాడు. శుక్రవారం ఉదయమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే శుక్రవారం ఐమ్యాక్స్ లో వేయాల్సిన 8.45 గంటల షో రద్దు అయింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి కూడా మెసేజ్ లు వచ్చాయి. సాంకేతిక కారణాలతో టిక్కెట్ రద్దు అయిందని..పది రోజుల్లో డబ్బును రిఫండ్ చేస్తామంటూ మెసేజ్ లు అందాయి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజే ఎదురుదెబ్బ తగలటం హీరో బెల్లంకొండను తీవ్ర నిరాశకు గురిచేసింది.

తన ఫేస్ బుక్ పేజీలో కూడా రోజూ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెట్టిన హీరోకు ఇది ఊహించని పరిణామమే. ఈ సినిమా షోలు ఆగిపోవటానికి ‌నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదమే కారణం అని ప్రచారం జరుగుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ, ఏపీలో కూడా మార్నింగ్ షోలు అన్నీ రద్దు అయ్యాయి. దీంతో శుక్రవారం సినిమా విడుదల ఉంటుందా? ఉండదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే మార్నింగ్ షోలు లేకపోయినా తర్వాత సినిమా ప్రారంభం కావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story
Share it