Telugu Gateway
Andhra Pradesh

బయటపడిన టీడీపీ ఎంపీల అసలు రంగు

బయటపడిన టీడీపీ ఎంపీల అసలు రంగు
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘పోరాటాలు’ నిజమైనవి అనుకుంటున్నారా?. అలా అనుకుంటే మీరు పప్పులే కాలేసినట్లే. ఆయన ఏదైనా రాజకీయ ప్రయోజనం ఉంటే తప్ప..ఏదీ చేయరు. అంత మాత్రాన మిగిలిన వారు ఏదో దేశ సేవ కోసం చేస్తున్నారని కాదు. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ విషయంలో పది ఆకులు ఎక్కువ చదివారు అని చెప్పటమే మన ఉద్దేశం. టీడీపీ పోరాటాలు ఎంత సీరియస్ గా ఉంటాయో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. టీడీపీ నేతల దీక్షలు బరువు తగ్గటానికి...ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవటానికి చేస్తారా?. ఏమో ఆ పార్టీ ఎంపీ మురళీ మోహన్ మాటలు చూస్తే అలాగే ఉన్నాయి.

‘నేను ఓ ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను. అనుమతిస్తే ఓ వారం రోజులు దీక్ష చేస్తా’ అంటూ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో విన్పిస్తున్నాయి. అంతే కాదు..మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా జోన్ లేదూ..గీన్ లేదూ అంటూ వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. గత రెండు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఓ చోట కూర్చుని మాట్లాడుకున్న మాటల వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

https://www.facebook.com/srinivas.kusampudi.3/videos/629083687448414/?q=srinivas kusumapudi

Next Story
Share it