కొత్త బంగారు లోకం హీరోయిన్ పెళ్లి
శ్వేతబసుప్రసాద్. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకుని బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారు. తనకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించారు కూడా. అయితే పెళ్లికి తొందరలేదని తేల్చిచెప్పారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టలతో ఆమె వివాహం జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరూ సరదగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
శ్వేతబసు ప్రస్తుతం గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్తో పాటు ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు అని ఓ మీడియా సంస్థకు తెలిపారు. తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.