ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటో..
BY Telugu Gateway18 Jun 2018 5:25 AM GMT
X
Telugu Gateway18 Jun 2018 5:25 AM GMT
ఎన్టీఆర్ కు ఈ మధ్యే కొడుకు పుట్టాడు. అయితే తన పెద్ద కొడుకు అభయ్ ఒడిలో చిన్నొడిని పెట్టి.. తనే స్వయంగా తీసిన ఆ ఫోటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి విదితమే. ఇన్స్టాగ్రామ్ లో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. రెండో సారి తండ్రి అయిన సందర్భంగా ‘నా కుటుంబం మరింత పెద్దదైంది.
మగ బిడ్డ’ అంటూ ట్వీట్ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత రాఘవ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో నటించనున్నారు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా ఉన్న విషయం తెలిసిందే.
Next Story